దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా తన ప్రియుడి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సమంత నయనతార విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే ఈ జంట ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న ఈ ప్రేమ జంట తాజాగా షిరిడి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాబా దర్శనం అనంతరం ఆలయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ షిర్డీలో నా కన్మనీతో.
షిర్డీ సాయిని దర్శించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎంగేజ్మెంట్ రింగులతో అందరినీ ఆశ్చర్యపరిచారు.అయితే గత కొద్ది నెలల క్రితం ఈ జంట రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు అంటూ పెద్దఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి.
అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.