కొందరు సినీ నటి నటులు తమ నిజ జీవితాన్ని సినిమాలలో నటించే నటుల నుండి కోరుకుంటారు.ఇలా ఎంతోమంది నటీనటులు తమతో నటించే నటీనటులతో పరిచయం పెంచుకొని వారితోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు.
ఇప్పటివరకు చాలా మంది నటీనటులు చేసుకోగా.కొంతమంది వారి పరిచయాలతోనే ముగింపు చేసినవాళ్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే తమ నిజజీవితంలో ప్రేమలో పడ్డా ఆ నటులు.ఓ సినిమాలో తండ్రి కూతురు గా నటించారు.
ఇంతకీ ఆ నటులు ఎవరో కాదు.నానాపటేకర్, మనిషా కోయిరాలా.వీరిద్దరూ నిజ జీవితంలో ముక్కుసూటి మనుషులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.1996లో వచ్చిన అగ్నిసాక్షి సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఇక ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగింది.కానీ అప్పటికే మనీషా.వివేక్ ముష్రాన్ తో బ్రేకప్ అయిన బాధలో ఉండగా.తనపై మరింత ప్రేమ చూపిస్తున్న నానాతో మరింత స్నేహం పెంచుకుంది మనిషా.
ఇక అదే ఏడాది వచ్చినాక ఖాయోషీ సినిమాలో వీరిద్దరూ తండ్రి కూతురు గా నటించారు.ఇక ఆ సమయంలో వారి మధ్య ప్రేమ మరింత బలపడగా ఆ విషయం మొత్తం సినీ పరిశ్రమలో కోడైకూసింది.
ఇక వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి గా చేసుకోవాలని అనుకోగా.అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న నానా ను తన భార్యకు విడాకులు ఇవ్వమని కోరింది.ఇంతకీ ఆయన భార్య ఎవరో కాదు.మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత.
అంతే కాకుండా మంచి శిల్పిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నీలకాంతి.పెళ్లి కొన్ని రోజుల తర్వాత మరి మధ్య కొన్ని విభేదాలు కూడా ఎదురయ్యాయి.
ఇక పిల్లలు ఉండటంతో వారి ముందు పోట్లాడుకోవడం ఇష్టంలేక విడాకులు తీసుకోకుండా దూరంగా ఉన్నారు.
ఇక ఈ తరుణంలో మనిషా తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోగా ఆమెతో విడాకుల కోసం ఒత్తిడి తీసుకు వచ్చింది.
కానీ ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోగా నివ్వెరపోయింది మనీషా.ఇక నానా మరో నటి ఆయేషా జుల్కా తో దగ్గరగా ఉంటున్న విషయం ఆ సమయం లో వైరల్ కాగా.
వారి మధ్య ఉన్న సన్నిహితాన్ని చూసి అతనితో ప్రేమను దూరం చేసుకుంది మనిషా కోయిరాల.కానీ ఓ సందర్భంలో నానా తనని మనిషా వదిలి వెళుతుంటే అది కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
ఇక 2010లో నేపాల్ కు చెందిన ఓ వ్యాపార వేత్తను మనిషా పెళ్లి చేసుకోగా అతనితో రెండేళ్లకే విడాకులు తీసుకుంది.ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న మనిషా ఆ తర్వాత సినిమాల్లో మళ్లీ నటించడం ప్రారంభించింది.