ఒకప్పుడు సాధారణ వ్యక్తులు మాత్రమే సోషల్ మీడియాలో( Social Media ) యాక్టివ్ గా ఉండేవారు.ఫొటోలు షేర్ చేసుకోవడంతో పాటు ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకునేవారు.
ఫ్రెండ్స్ పోస్ట్లకు లైక్లు, కామెంట్లు పెడటం లాంటివి చేసేవారు.కానీ ఇప్పుడు కాలం మారింది.
పెద్ద పెద్ద సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు.ఫాలో అవ్వడమే కాదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పోస్ట్ లు పెడుతున్నారు.తమ అభిప్రాయాలను సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలపై స్పందిస్తున్నారు.
అయితే తాజాగా నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్( Temjen Imna Along ) సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియోను షేర్ చేశాడు.మహిళలు వరి నాట్లు వేస్తున్న వీడియోలను షేర్ చేశాడు.ఈ వీడియోలో పోలంలో మోకాలి లోతు నీటిలో నిలబడి మహిళలు వరినాట్లు ( Planting Paddy ) వేస్తున్నారు.
అందరూ ఒకే పద్దతిలో, ఒకే వరుసలో కలిసికట్టుగా వరినాట్లు వేస్తున్నారు.ఒకే లైన్ లో అందరూ పోటీపడి వరినాట్లు వేస్తున్నారు.ఈ వీడియోను షేర్ చేసిన నాగలాండ్ మంత్రి.మహిళా ఐక్యత, సామరస్యం, సాధికారితను ఇది ప్రతిబింబిస్తోందని, మెరుగైన భవితవ్యానికి ఇది నాంది అని తెలిపారు.
మహిళలు సాధికారికత సాధించిన చోట అద్బుతమైన పంటలను అందించడం ద్వారా భూమి సైతం వికసిస్తుందని క్యాప్షన్ రాసుకొచ్చారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఉన్న మహిళలు నాగాలాండ్ జిల్లాలోని ఫెక్ జిల్లాకు చెందినవారిగా తెలుస్తోంది.అయితే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.
ఎప్పుడు ఏవోక స్పూర్తిదాయక వీడియోలను షేర్ చూస్తూ ఉంటారు.దీంతో ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.