భారతీయులు భోజనం ముగించే సమయంలో లేదా ముగించిన తర్వాత ఓ స్వీటు తింటారు.కొన్ని రుచికరమైన చాక్లెట్లు అయినా, ఇష్టమైన ఐస్క్రీమ్ అయినా, సాంప్రదాయ తీపి పదార్థాలు, స్వీట్లు అయినా విందు భోజనాల్లో ఖచ్చితంగా వడ్డిస్తారు.
స్ట్రీట్ ఫుడ్ స్వీట్ల విషయానికి వస్తే, రోడ్సైడ్లో తాజాగా తయారుచేసిన స్వీట్లు మనలను ఎప్పుడూ ఆకర్షిస్తాయి.వాటిని చూడగానే కొనేందుకు వెంటనే క్యూలో ఉంచేలా చేస్తాయి.
ఇప్పటికే భారతదేశంలోని చాలా ప్రసిద్ధ స్వీట్లను అందరూ రుచి చూసి ఉంటారు.అయితే ఈ జాబితాలో మొత్తం ప్రపంచంలో ఏది ఉత్తమమో మీకు తెలుసా? క్రొయేషియాకు చెందిన ఆన్లైన్ ట్రావెల్ మరియు ఫుడ్ గైడ్ టేస్ట్అట్లాస్ ‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్’ జాబితాను విడుదల చేసింది.ఇందులో కొన్ని భారతీయ స్వీట్లు కూడా చోటు దక్కించుకున్నాయి.

కొన్ని భారతీయ స్ట్రీట్ ఫుడ్ స్వీట్లు కూడా ‘ప్రపంచంలోని ఉత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్’ జాబితాలో చేరాయి.దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రజలు తినే మైసూర్ పాక్ 14వ స్థానంలో ఉంది.కుల్ఫీ 18వ స్థానంలో నిలిచింది.
కుల్ఫీ ఫలూదా కూడా ఈ జాబితాలో ఉంది.దానికి 32వ ర్యాంకు దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ డెజర్ట్గా పాస్టెల్ డి నాటా, సాంప్రదాయ పోర్చుగీస్ గుడ్డు కస్టర్డ్ టార్ట్ పేరుపొందింది.టార్ట్ను 18వ శతాబ్దానికి ముందు పోర్చుగల్లోని లిస్బన్లోని శాంటా మారియా డి బెలెమ్లో కాథలిక్ పెద్దలు తయారు చేశారు.
మిగిలిపోయిన గుడ్డు సొనలు వంటకం చేయడానికి ఉపయోగించబడ్డాయి, తర్వాత మతాధికారులు పాస్టెల్ డి నాటాను వాణిజ్యపరంగా విక్రయించడానికి బేకరీని ఎంచుకున్నారు.

ఈ జాబితాలో రెండో ర్యాంక్ను ఇండోనేషియాలోని జావాకు చెందిన సెరాబీ దక్కించుకుంది.ఇవి బియ్యం పిండి, కొబ్బరి పాలు లేదా తురిమిన కొబ్బరితో చేసిన చిన్న ఇండోనేషియా పాన్కేక్లు.టేస్టీట్లాస్ ప్రకారం, టర్కీలోని కహ్రామన్మరాస్కు చెందిన దొందుర్మా ప్రపంచంలోని మూడవ అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ డెజర్ట్.
ఇది మొదట టర్కిష్ ఐస్ క్రీం.ఇది మరాస్ నగరంలో ఉద్భవించింది.