ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదు మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్ధి నామినేషన్ వేసారు.
నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐదు మంది ఏకగ్రీవంగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
టీడీపీ నుంచి ఎమ్మెల్సీలుగా యనమల, అశోక్ బాబు, బీటీ నాయుడు, రామారావు ఎన్నిక కాగా, వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.
ఇక వారు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం ద్రువీకరించడం విశేషం.ఇక ఎమ్మెల్సీలుగా విద్యార్ధి, ఉపాధ్యాయ, ఉద్యోగ విభాగాల వారీగా త్వరలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది.
మరి ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.