భారత దేశంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కంటే తన సైన్యాన్ని ఎంత కలిగి ఉండో జర్మనీకి చెంది ఓ కంపెనీ తన నివేదికలో స్పష్టం చేసింది.ఈ నివేదికలో పక్కన ఉన్న చైనా అత్యాధిక సైన్యాన్ని కలిగి మొదటి స్థానంలో నిలువగా.
రెండో స్థానంలో ఇండియా నిలిచింది.అయితే జర్మనీకి చెందిన ఆ కంపెనీ నివేదికలో బ్రిటన్ తన సైన్యాన్నిచూస్తే ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.
ఇటివల కాలంలో చైనా తన అధిపత్యాన్ని పెంచుకోవడానికి దూకుడుగా వెళ్తుంది.తన సైనిక శక్తిని పెంచుకుని ప్రపంచంలో అతిశక్తి వంతమైన దేశంగా నిలువాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అదే రీతిలో తన సైన్యాన్ని పెంచుకుంది.ప్రపపంలోనే అతి పెద్ద ఆర్మీని కలిగి ఉన్న దేశాలలో చైనా మొదటి స్థానంలో నిలిచింది.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాగా పేర్కొంది.దేశ రక్షణ కోసం చైనా తన ఆర్మీని వివిధ శాఖలుగా ఏర్పాటు చేసుకుంది.2021లో చైనా ఆర్మీలో 21,85,000.చేరారు.
కమ్యూనిస్ట్ దేశం తరువాత భరత్ అతిపెద్ద రెండో సైనిక సిబ్బందిని కలిగి ఉంది.భారత్ సైన్యంలో 14,45,000 ఉండగా, అందులో వివిధ శాఖలను ఇండియా ఏర్పాటు చేసి దేశ రక్షణ కోసం ప్రాధాన్యత నిస్తోంది.
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవితో అతిపెద్ద పారామిలిటరీ ఫోర్స్ ను భరత్ కలిగి ఉంది.
ప్రస్తుతం ప్రపపంచ వ్యాప్తంగా అధిపత్యాన్ని చలాయిస్తున్న ఆమెరికా ఈ నివేదికలో మూడో స్థానంలో నిలిచింది.
ఆమెరికా ఆర్మీలో 14,00,000 మంది సిబ్బంది ఉన్నారు.చైనా, ఇండియా, ఆమెరికా తరువాత ఉత్తర కొరియా, రష్యా , పాకిస్తాన్ , దక్షిణ కొరియా , ఇరాన్ , వియత్నాం, సౌదీ అరేబియా నిలిచాయి.
ఇండియా పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో 2,04,000 సైన్యం కలిగి చివరి స్థానంలో ఉంది.పాకిస్తాన్ లో 6,54,000 మంది.ఈ జాబితాలో బ్రిటన్ సైనిక సంపత్తి చూస్తే ఆందోళన కలిగిస్తుందిని పేర్కొంది.ఈజిప్ట్, మయన్మార్, టర్కీ వంటి కంటె బ్రిటన్లో ఆర్మీ తక్కువగా ఉంది.2021 ఏప్రిల్ నాటికి చూస్తే ఆ దేశంలో 1,59,000 సైనిక సిబ్బంది ఉన్నారు.