ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ స్కాం కేసు విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

 Liquor Scam Case Trial In Delhi Rouse Avenue Court-TeluguStop.com

మనీలాండరింగ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఈ మేరకు నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది.కాగా, జనవరి 6న 13 వేల 657 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఐదుగురు నిందితులతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది.అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుతో అమిత్ అరోరాలను ఈడీ చేర్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube