ఏపీకి రావాలని సినీ పరిశ్రమను సీఎం జగన్ కోరారని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ అన్నారు.ఈ క్రమంలో స్టూడియోలు పెట్టుకోవడానికి 50 ఎకరాల వరకు ఇస్తామన్నారని తెలిపారు.
అదేవిధంగా సినీ పరిశ్రమకు ఎలాంటి ప్రోత్సాహకాలైనా సీఎం జగన్ ఇస్తామన్నారని పోసాని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే విశాఖ వచ్చే అవకాశాన్ని పరిశీలించాలని తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కోరతామని పోసాని వెల్లడించారు.