స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాతో మరోసారి అల వైకుంఠపురములో వంటి బ్లాక్బస్టర్ను అందుకోవాలని బన్నీ చూస్తున్నాడు.
పుష్ప చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకోకముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు బన్నీ సిద్దమయ్యాడు.
కాగా ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని, అందుకే ఈ సినిమాను ఎక్కువగా బాలీవుడ్ జనాలు మెచ్చుకునేలా రెడీ చేయాలని బన్నీ కొరటాలను కోరాడట.అయితే తెలుగు ఆడియెన్స్కే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే కొరటాల, బన్నీ కోరికకు నో చెప్పాడట.
తాను తీయబోయే సినిమా తెలుగు ప్రేక్షకులు మెచ్చేదిగా ఉంటుందని ఆయన తేల్చి చెప్పాడట.
మొత్తానికి పాన్ ఇండియా చిత్రాల ప్రభావంతో బన్నీ కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే బన్నీ నటిస్తు్న్న పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో వస్తుండగా, ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.
కన్నడ కుట్టి రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.అటు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
మరి బన్నీ కోసం కొరటాల ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.