టీడీపీ వైపు గౌరు ఫ్యామిలీ! వైసీపీ వైపు దాడి ఫ్యామిలీ!

ఎన్నికలు సమీపించడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలలో నాయకుల చేరికలు షురూ అయ్యింది.టీడీపీ నుంచి వైసీపీలోకి, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకుల జంపింగ్ ల పర్వం ఇంకా కొనసాగుతూ వుంది.

 Jumping Leaders Joins Tdp And Ysrcp-TeluguStop.com

పాత కాపులకి జనసేనలో చోటు లేకపోవడంతో సీట్లు ఆశించే నేతలందరూ టీడీపీ, లేదంటే వైసీపీ పార్టీలో చేరుతున్నారు.అయితే టీడీపీ చేరుతున్న వారికి చంద్రబాబు నుంచి సీట్లు ఇచ్చే హామీ వస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే వైసీపీలో జగన్ నుంచి కొంత మందికి మాత్రమే హామీ లభిస్తుంది.

ఇదిలా వుంటే ఈ రోజు కూడా టీడీపీ, వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి నేతలు రెడీ అయ్యారు.

వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆమె భర్త ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు.అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అతని కొడుకు ఈ రోజే వైసీపీలో చేరబోతున్నారు.

అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నారు.ఇక గౌరు చరితకి టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.అయితే వైసీపీ నుంచి దాడి ఫ్యామిలీకి జగన్ ఎంత వరకు టికెట్ హామీ ఇస్తాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube