రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ కు చేరుకుంది.

 Intense Tension At Azad Chowk In Rajahmundry.-TeluguStop.com

కాగా రైతుల పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు సీపీఐ పార్టీలు మద్ధతు పలికాయి.మరోవైపు అదే ప్రాంతంలో వికేంద్రీకరణకు మద్ధతుగా సభ నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు.

ఈ క్రమంలో అమరావతి రైతులకు వ్యతిరేకంగా వికేంద్రీకరణ మద్ధతుదారులు నినాదాలు చేశారు.అనంతరం నల్ల బెలూన్లతో నిరసనకు దిగారు.

ఓ పక్క వికేంద్రీకరణ మద్ధతుదారులు, మరోపక్క అమరావతి రైతులతో ఆజాద్ చౌక్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.దీంతో ఇరువర్గాల వారు పరస్పరం చెప్పులు, వాటర్ బాటిళ్లు విసురుకున్నారు.

ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాట వాగ్వివాదానికి దారి తీసింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube