జనవరి 7న రిలీజ్ ఎనౌన్స్ చేసిన ఆర్.ఆర్.
ఆర్ సినిమా మీద దెబ్బ మీద దెబ్బ పడుతుంది.సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నా సరే మరో పక్క దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీ యెల్లో కేటగిరి లోకి వెళ్లింది.
ఈ క్రమంలో థియేటర్లు, షాపింగ్ మాల్స్, అన్నిటినీ క్లోజ్ చేస్తున్నారు.బాలీవుడ్ సినిమాకు ఢిల్లీ అతి పెద్ద మార్కెట్ అక్కడే ఎక్కువ రెవెన్యూ వస్తుంది.బాహుబలి సినిమాకు ఆ ఏరియాలోనే 90 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయి.ఇక ఇప్పుడు ఆర్.
ఆర్.ఆర్ సినిమాకు ఆ కలక్షన్స్ గండి పడినట్టే.
అంతేకాదు మహరాష్ట్రతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కొనసాగుతుంది.ఇలానే చేస్తే ఆర్.ఆర్.ఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవడం కష్టం.ఎలా లేదన్నా ఢిల్లీ వల్ల మిగతా ఏరియాలు 50 శాతం ఆక్యుపెన్సీ వల్ల ఆర్.ఆర్.ఆర్ కు 150 కోట్ల దాకా లాస్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.మరి చివరి నిమిషంలో రిలీజ్ డేట్ మారుస్తారా లేక ఈసారి తగ్గేదేలే అని ప్రొసీడ్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.
సినిమా రిలీజ్ పై ఈ రేంజ్ టెన్షన్ ఏ సినిమాకు ఉండదని చెప్పొచ్చు.ఆర్.ఆర్.ఆర్ మాత్రమే కాదు రాధే శ్యాం సినిమా కూడా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది.