దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
రెండో ఛార్జ్ షీట్ లో మాగుంట రాఘవ, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రాపై ఈడీ అభియోగాలు చేసింది.మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో అరుణ్ పిళ్లై, అమన్ దీప్ ధల్ పై అభియోగాలు చేసింది.
ఈ నేపథ్యంలో ఛార్జ్ షీట్ లపై విచారణను ఈనెల 10కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.