క్రికెట్ అంటేనే మన దేశంలో యమ క్రేజ్ ఉంటుంది.ఇక తమ అభిమాన క్రికెటర్లను ఎవరు ఏమన్నా సరే వెంటనే ఖండిస్తూ ఉంటారు అభిమానులు.
ఇక ఇప్పుడు ఓ క్రికెటర్ భార్య చేసిన పని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.అయితే ఆమె తన భర్త గొప్పతనం గురించి చెప్పుకునే క్రమంలో ఇతర క్రికెటర్లను ఎటకారం ఆడినట్టు కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఆ క్రికెటర్ల ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇక ఆమె ఎవరో కాదండోయ్ మన ఇండియా క్రికెటర్ అయిన స్టువర్ట్ బిన్నీ భార్య అలాగే ఫస్త్రమస్ యాంకర్ అయిన మయంతి లాంగర్.
అయితే ఆమె ఇప్పుడు ఇండియాకు అలాగే ఇంగ్లండ్ కు జరుగుతున్న సిరీస్ లో భాగంగా ఈ కామెంట్లు చేసింది.
అదేంటంటే ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ వేస్తున్న బంతులను ఎదుర్కునేందుకు మన బ్యాట్స్ మెన్లు బాగానే కష్టపడుతున్నారు.దీంతో ఆయన కారణంగానే తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది.
దీంతో ఇప్పుడు మయంతి కోహ్లీ అలాగే రహానేలను ఎటకారంగా మాట్లాడేస్తూ ఓ పోస్టు చేసింది.అయితే ఇందులో ఆమె తన భర్త గొప్పతనాన్ని గుర్తు చేసేకోవాలనుకుని 2014 ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ లో భాగంగా బిన్నీ బౌండర్ బాదితే బౌలర్ ఆండర్సన్ తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
![Telugu Binny, Kohli, Mayanti Langer, Natizens, Rahane, Sport-Latest News - Telug Telugu Binny, Kohli, Mayanti Langer, Natizens, Rahane, Sport-Latest News - Telug](https://telugustop.com/wp-content/uploads/2021/08/binny-Cricketers-wife-slams-rahane-sport-news-natizens-comments-test-match.jpg )
అయితే ఆమె తన పోస్టు ద్వారా ఇప్పుడున్న స్టార్ క్రికెటర్లలో తన భర్త లాంటి టాలెంట్ కోల్పోయారని చెప్పకనే చెప్పింది.ఇంకేముంది ఒక ఫొటోవేల భావాలకు నెలవు అన్న మాదిరిగా ఈ ఫొటోను కోహ్లీ అభిమానులకు తగిలింది.దీంతో వారు ఊరుకుంటారా నీ భర్త గరించి చెప్పాలనుకుంటే చెప్పు కానీ వేరే వారిని ఎందుకు కించపరిచినట్టు పోస్టు పెట్టడం అని అంతా ఫైర్ అవుతున్నారు.ఒక బాధ్యత గల ప్రొఫెషనల్ లో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్లు ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు.
మొత్తానికి ఆమె చేసిన పోస్టు విమర్శల పాలవుతోంది.