యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి గురువారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆమెకు ఆలయ అర్చకులు,ఈవో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గీతా రెడ్డికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.