ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కొరియోగ్రాఫర్స్ పేర్లు చెబితే అందులో కచ్చితంగా అనీ మాస్టర్ ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ఈమె సౌత్ ఇండియాలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.
స్టార్ హీరోల సినిమాలలో కూడా అనీ మాస్టర్ డాన్స్ ఒక్క పాటలో అయినా ఉండాల్సిందే.అంతగా ఈమె పాపులారిటీ సొంతం చేసుకుంది.
అయితే ఈమె రూపం ఒక్కోసారి ఈమెని కాస్తా అవమానాలకు గురి చేసింది.ఈ విషయాన్ని ఓ షోలో అనీ మాస్టర్ షేర్ చేసుకొని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆనీ మాస్టర్ ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో ఆమె చూసేందుకు చైనీస్ వ్యక్తి లాగా ఉంటారు.తాము భారతీయులమేనని, కానీ చాలా మంది తమను చైనీస్ అంటూ వెక్కిరిస్తుంటారని చెప్పుకొచ్చింది.ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్, అలాగే ఉద్యోగులను చైనీస్ అంటూ వేధింపులకు గురి చేస్తుంటారని ఆమె చెప్పుకొని వాపోయారు.తాజాగా ఆమె పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాంలో మరో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా ఆనీ మాస్టర్ ను పట్టుకొని చైనీస్ బొమ్మ అంటూ కామెంట్ చేశాడు.
దానిపై ఆనీ మాస్టర్ అసహనానికి గురైంది.తాము భారతీయులమే అని, చైనాకు చెందిన వారం కాదని చెప్పుకొచ్చింది.ఇటీవల ఆమె తన పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పుస్తకాలు కొనేందుకు మెహదీపట్నం వెళ్లగా, అక్కడ కొందరు తనను చూసి చైనీస్ మహిళ అంటూ వ్యాఖ్యానించారని, అంతటితో ఆగకుండా అదిగో కరోనా వైరస్ వెళుతోంది అంటూ అవమానించారని కన్నీళ్ల పర్యంతం అయ్యింది.చైనా వాళ్ళ రూపంలో ఉండే ఈశాన్య రాష్ట్రాలకి చెందిన ప్రజలు ఇండియాలో ఏ రకమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు అనీ మాస్టర్ మాటల్లో అర్ధమైంది.