టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి( Deputy CM Narayana Swamy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకి దళితులు అంటే వ్యతిరేక భావన ఉందని చెప్పారు.
అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదన్నారు.తనకు సీఎం జగన్ మంచి అవకాశం ఇచ్చారన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జగన్ ను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ లో రూ.100 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నది ఎవరని ప్రశ్నించారు.చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని తెలిపారు.వైఎస్ఆర్ మరణం సమయంలో కాంగ్రెస్ పై షర్మిల( Sharmila ) అనేక విమర్శలు చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు అదే కాంగ్రెస్ లో ఎలా చేరారని ప్రశ్నించారు.చంద్రబాబు, షర్మిల ఒకటేనని విమర్శించారు.