కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.ఖమ్మం జిల్లాలో పోడు భూముల పట్టాలను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.
ఎన్నికల సమయానికే కాంగ్రెస్ నేతలు బయటకు వస్తారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతారని చెప్పారు.
తాము ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు.కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు జరిగాయన్న ఆయన బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలన వద్దనే ప్రజలకు బీఆర్ఎస్ కు పట్టం కట్టారని స్పష్టం చేశారు.ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు.