క్యాన్సర్ అనే వ్యాధి మనిషిని క్రమక్రమంగా తినేస్తూ నరకం అంటే ఏంటో చూపిస్తుంది.క్యాన్సర్ మనిషిని శారీరికంగానే కాక మానసికంగా కూడా దెబ్బ తీస్తుంది.
ఇలాంటి క్యాన్సర్ కోరల నుండి చాలా తక్కువమంది బయటపడతారు.ప్రస్తుతం ఉన్న వార్త సమాచారం మేర బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అది మూడవ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ వ్యాధి ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం ఆయన అమెరికాకు వెళ్లినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి టైంలో ఈ క్యాన్సర్ మహమ్మారిని విజయవంతంగా జయించిన యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా సంజయ్ దత్ లో మానసిక స్థైర్యం నింపేందుకు నువ్వు ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కూడా ఓ ఫైటర్ వే.ఆ నొప్పి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వు దృఢంగా కాన్సర్ తో పోరాడి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.అందుకోసం ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను అంటూ ట్వీట్ చేశారు.
2011 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించాక లండన్ లో చికిత్స అనంతరం క్యాన్సర్ ను జయించిన యువరాజ్ లాంటి వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతున్న సంజయ్ గురించి ఇలా ట్వీట్ చేయడం మంచి ఆలోచన అని విశ్లేషకులు యువరాజ్ ను ప్రశంసిస్తున్నారు
.