బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాల్సి ఉంది.సాయి శ్రీనివాస్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
షూటింగ్ మొదలు కాబోతుంది అనే సమయానికి నిర్మాత బెల్లంకొండ సురేష్కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో సినిమా షూటింగ్ మొత్తానికి క్యాన్సిల్ చేయడం జరిగింది.దాంతో కొంత గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్ మరోసారి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడు.
ఈసారి భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.
తాజాగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా నటించే సినిమాకు పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
తమిళంలో రెండు సంవత్సరాల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన ‘సుందర పాండ్యన్’ సినిమాకు ఇది రీమేక్గా తెరకెక్కుతుంది.అతి తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.
శరవేగంగా చిత్రీకరణ జరిపి ఇదే సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రెండవ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.