కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం దేవాలయం వెలుపల అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు అందిస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ గా మారింది.దాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను… ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడ్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందన్నారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి కొట్టి, ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.