నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఒక వైపు భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.దసరా కి ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా కీలక పాత్ర లో స్టార్ హీరోయిన్ శ్రీలీల నటించింది.మొత్తానికి ఈ సినిమా కి పాజిటివ్ జబ్ వచ్చింది.
ఒక వైపు భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా తో దసరా కి అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం అయింది.మరో వైపు బాలయ్య తన టాక్ షో అన్ స్టాపబుల్ ని కూడా సీజన్ 3 కి రెడీ చేస్తున్నాడు.
ఆహా వారితో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒప్పందం చేసుకోవడం జరిగింది.
అయితే అన్ స్టాపబుల్ లో వచ్చే గెస్ట్ ల విషయం లో బాలయ్య దే తుది నిర్ణయం అంటూ ముందస్తు ఒప్పందం చేసుకున్నారట.బాలయ్య కి అనుకూలమైన వారు.ఆయనకి నచ్చిన వారు మాత్రమే షో లో ఉండేలా ప్లాన్ చేశారట.
ఆహా వారు కూడా అందుకు ఓకే చెప్పారట.బాలకృష్ణ కు చెందిన వారు ఆహా టీం( Aha ott ) తో కలిసి గెస్ట్ ల ఎంపిక విషయం లో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి విషయం లో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బాలయ్య మరియు చిరంజీవి కలిసి షో చేస్తే ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కానీ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.మొత్తానికి బాలయ్య అన్ స్టాపబుల్ షో దసరా నుండి కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే గెస్ట్ ల విషయం లో ఆహా వారు మరియు బాలయ్య మధ్య రాజీ కుదిరే విధంగా గెస్ట్ లు లభిస్తారా అనేది చూడాలి.