కరోనా వైరస్.ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో చెప్పలేం.
ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాస్కులు, శానిటైజెర్లు ఉపయోగిస్తున్న కరోనా వైరస్ వ్యాపిస్తుంది.అయితే కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకుంటే ప్రమాదం ఉండదు.
కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మందులు తీసుకోవాలి.అప్పుడే మనల్ని మనం రక్షించుకోగలం.
అయితే కరోనా వైరస్ వ్యాపించిన వారికి ఈ చెడ్డ అలవాట్లు ఉంటే బ్రతకడం కష్టం అని అంటున్నారు వైద్యులు.నోటి శుభ్రంగా ఉంచుకోనివారికి, సిగేరేట్లకు, బీడీలకు అలవాటైన వారికి.
ఎక్కువ మద్యం సేవించేవారికి ప్రమాదం ఎక్కువ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కరోనా వైరస్ ప్రభావం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలోనే ఉంటుందని అంటున్నారు.

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారు కూడా కరోనా రాకుండా జాగ్రత్త పడాలని, వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.నోటి పరిశుభ్రతకు కరోనా వైరస్ కు సంబంధం ఉందని పరిశోధన చేసిన పరిశోధకులు చెప్తున్నారు.అందుకే పాన్ పారక్ వంటివి తీసుకోకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.