టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఈ సినిమాను ఎట్టకేలకు వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా దెబ్బకు వారు ఈ సినిమాను సైలెంట్గా ఓటీటీలో రిలీజ్ చేశారు.కాగా ఈ సినిమా రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో నిశ్శబ్ధం చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు.
ఇక ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ స్థాయిలో ఈ సినిమా గురించి చెప్పుకొచచిన చిత్ర యూనిట్, రిలీజ్ తరువాత ఫలితంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అటు అనుష్క కూడా ఈ సినిమా రిజల్ట్తో అప్సెట్ అయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాపై అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న అనుష్క, చిత్రం ఫ్లాప్ కావడంతో సైలెంట్ అయిపోయింది.కేవలం థ్రిల్లర్ అంశాలతో సినిమాకు హిట్ అందించాలని చూసిన చిత్ర యూనిట్ బొక్కబోర్లా పడింది.
అనుష్క లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు.కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసిన హేమంత్ మధుకర్ పనితనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ సినిమాకు నిర్మాత అయిన కోన వెంకట్ను తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్లో ఏసుకుంటున్నారు.ఈ మాత్రం సినిమాను అప్పుడే థియేటర్లలో రిలీజ్ చేసుంటే బాగుండేదని, ఇప్పుడు అనవసరంగా ఓటీటీలో రిలీజ్ చేశారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
ఏదేమైనా అనుష్క ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు.కానీ సినిమా రిలీజ్ తరువాత అందరూ సైలెంట్ అయ్యారు.
మరి తన నెక్ట్స్ చిత్రాన్ని అనుష్క ఎలాంటి జోనర్తో తెరకెక్కిస్తుందో చూడాలి.