కరోనా కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.షోలు, సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో మొత్తం ఇంట్లో వారికి నచ్చిన పనితో కాలక్షేపం చేస్తున్నారు.
కొందరు సోషల్ సర్వీస్ చేస్తే, కొందరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.మరికొందరు ఇంటి పని చేసుకుంటున్నారు.
అలాగే టాలీవుడ్ యాక్టర్, స్టార్ యాంకర్ అయిన రష్మి కూడా తనకి దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సోషల్ సర్వీస్ కోసం ఉపయోగించుకుంటుంది.లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అయిపోయారు.
అయితే రోడ్డున బ్రతుకుతున్న అభాగ్యులు, మూగజీవాలని చూసిన ఆమె మనసు కరిగిపోయింది.ఇక తనకి తోచిన సాయం చేయడానికి రంగంలోకి దిగిపోయింది.
ప్రస్తుతం వైజాగ్ లో ఉన్న ఆమె లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మూగజీవాలకి ఆహారం పెట్టింది. తాజాగా ఏప్రిల్ 27న రష్మీ లాక్ డౌన్ లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.
ఇంటికే పరిమితం కావడంతో ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసే అవకాశం రాలేదు.దీంతో ఇంట్లోనే కేకు తయారు చేసుకొని.తన పెట్ డాగ్ తో కలిసి పుట్టిన రోజు జరుపుకుంది.ఈ సందర్భంగా దానికి సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
హాయ్.ఇట్స్ మై బర్త్ డే.నా డాగీ ఫ్రెండ్స్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.మొత్తానికి లాక్ డౌన్ టైంలో మూగజీవాలకి ఆహారం అందించడంతో పాటు ఆమె తన డాగీ ఫ్రెండ్ తోనే ఏకంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.