మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
14 మంది ప్రతివాదులకు ఇంకా నోటీసులు అందలేదని ఉండవల్లి న్యాయవాది తెలిపారు.పేపర్ పబ్లికేషన్ ద్వారా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.
నోటీసులు ఎలా జారీ చేయాలో తామే ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.