నటి స్నేహ( Sneha ) పరిచయం అవసరం లేని పేరు జూనియర్ సౌందర్యగా ఎంతో అద్భుతమైన నటనతో తన కట్టుబొట్టుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి నటి స్నేహ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.నటిగా ఇండస్ట్రీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి స్నేహ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా నటి స్నేహ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.ఈమె సాక్షాత్తు మధుర మీనాక్షి ( Madhura Meenakshi ) ఆలయ కలశాన్ని తాకారని ఇలా ఈ కలశాన్ని తాకినటువంటి మొదటి మహిళగా స్నేహ చరిత్ర సృష్టించారని తెలుస్తుంది.
మీనాక్షి అమ్మవారి ఆలయ కలశాన్ని స్నేహ తాకడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.నటి స్నేహ సుశీ గణేశన దర్శకత్వంలో హీరో ప్రశాంత్ సరసన నటించిన చిత్రం విరుంభం.ఈ సినిమాలో స్నేహ ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించారట.ఇక ఈ సినిమాలోని ఒక సన్నివేషంలో భాగంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయ కలశాన్ని తాకే ఒక సన్నివేశం ఉంది ఇక ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇలా ఈ సినిమా షూటింగ్లో భాగంగా స్నేహ( Sneha ) ఆలయ గోపురం పై ఉన్నటువంటి కలశాన్ని తాకారట.
ఇకపోతే ఇప్పటివరకు ఈ ఆలయ కలశాన్ని ఏ ఒక్క మహిళ కూడా తాకలేదని ఇలా స్నేహ ఈ ఆలయ కలశాన్ని తాకినటువంటి మొట్టమొదటి మహిళగా పేరు సంపాదించుకున్నారని చెప్పాలి అయితే ఈ విషయం దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఉండగా స్నేహ ( Sneha )ఎంతో సంతోషం వ్యక్తం చేశారట.ఇక ఈ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా అమ్మవారి ఆలయ కలశాన్ని తాకినటువంటి మొట్టమొదటి మహిళని మీకు ఇది ఎంతో అదృష్టం కలిగిస్తుందని చెప్పడంతో స్నేహ ఎంత సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.అమ్మవారి ఆలయ కలశాన్ని తాకడం అంటే నిజంగానే శుభ పరిణామం అని చెప్పాలి.
.