టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా ఇప్పటికీ అనుష్క వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.అక్టోబర్ నెలలో నిశ్శబ్దం విడుదలైన తరువాత అనుష్క చాలా కథలు విన్నా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గత కొన్ని నెలల నుంచి ఇంటికే పరిమితమైన అనుష్క పోలవరంలో సందడి చేశారు.మాస్క్ పెట్టుకుని సింపుల్ గా బోటులో వెళుతున్న అనుష్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలవరంలోని మహానందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం కొరకు ఆమె అక్కడికి వెళ్లారు.చిన్నప్పటి నుంచి అనుష్కకు దైవభక్తి ఎక్కువ కాగా నిన్న పశ్చిమ గోదావరిలోని పోలవరంకు ఆమె క్యాస్టూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి వచ్చారు.
ముఖానికి మాస్క్ ఉండటం వల్ల అనుష్కను అభిమానులు ఆలస్యంగా గుర్తు పుట్టారు.అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సింపుల్ గా రావడంతో ఆమె సింప్లిసిటీకి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు.
మంగళూరు నుంచి పురుషోత్తమపట్నం మీదుగా అనుష్క పోలవరంకు వచ్చారని సమాచారం.ఆలయంలో దర్శనం అనంతరం అనుష్క మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసం సమయంలో మహానందీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.గతంలో చాలాసార్లు మహానందీశ్వరస్వామి గుడికి రావాలని అనుకున్నానని కానీ షూటింగ్ ల వల్ల కుదరలేదని ఆమె అన్నారు.
ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని కార్తీకమాసంలో ఆలయాన్ని సందర్శించుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుష్క తెలిపారు.
మరోవైపు కరోనా విజృంభణ పూర్తిగా తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే ఆమె కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితం సర్కార్ వారి పాట సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు రాగా తర్వాత ఆ వార్తలు నిజం కాదని తేలింది.