ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో ప్రజలు నివసిస్తుంటారు.కొందరు పల్లెటూరిలో, మరికొందరు నగరంలో ఉంటారు.
కొన్ని గ్రామాలు పర్వతాలపై ఉన్నాయి.మరికొన్ని గ్రామాలు నది ఒడ్డున ఉంటాయి.
అయితే సముద్రంలో తేలియాడే గ్రామం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును సముద్రంలో తేలియాడే ఈ గ్రామం చైనాలో ఉంది.సముద్రం ఒడ్డున కనిపించే టంకా అనే గ్రామంలో మత్స్యకారులు నివసిస్తున్నారు.
టంకా అనే ఈ స్థావరం చైనాలోని ఫుజియాన్ రాష్ట్రంలోని నింగ్డే నగరానికి సమీపంలో సముద్రం ఒడ్డున ఉంది.ఇక్కడ దాదాపు 7 వేల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు.
ట్యాంకాను ‘జిప్సీ ఆన్ ది సీ‘ అని కూడా అంటారు.ఈ గ్రామం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైనది.700 ఏడీలో చైనాను టాంగ్ రాజవంశం పరిపాలించింది.
ఇక్కడి మత్స్యకారులు క్రీ.శ.700లో పాలకుల వేధింపులలను భరించలేక సముద్రంపై జీవించాలని నిర్ణయించుకున్నారు.వారు సముద్రంలో తమ పడవలపై ఇళ్ళు నిర్మించుకుని జీవించడం ప్రారంభించారు, అప్పటి నుండి ఈ ప్రజలు సముద్రం మీద నివసిస్తున్నారు.వారు చాలా అరుదుగా భూమిపైకి వస్తారు.
సముద్రంపై జీవించే ఆచారం ఇక్కడ నిరంతరం కొనసాగుతోంది.అప్పటి నుండి వారిని ‘సముద్రంపై జిప్సీలు‘ అని పిలుస్తారు.
వారు ఎప్పుడూ ఆధునిక జీవనశైలిని అనుసరించలేదు.టంకా తెగకు చెందిన ప్రజలు భూమిపై నివసించే ప్రజలను అసహ్యించుకుంటారని, వారిని తమ దగ్గరకు రానివ్వరని కూడా చెబుతుంటారు.
టంకా తెగ ప్రజల జీవితమంతా నీటిపై తేలియడే గృహాలలో, చేపల వేటలో గడిచిపోతుంది.ఇక్కడి ప్రజలు చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.చైనాలో చేపల పట్ల మక్కువ ఎక్కువ.చైనా ఏటా 32 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి జరుగుతుంది.చైనా.ప్రపంచంలోని చేపల ఉత్పత్తిలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉంది.