మినిమం గ్యారెంటీ సక్సెస్ చిత్రాల హీరో అల్లరి నరేష్ చూస్తుండగానే 50 చిత్రాల మైలు రాయిని చేరాడు.ఈయన తాజాగా నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం ద్వారా 50 అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుత యువ హీరోలు ఈ మార్క్ను చేయడం అంటే చాలా గొప్ప విషయం.అల్లరి నరేష్ కాకుండా ప్రస్తుతం ఉన్న మరే హీరో అయినా ఇన్ని సినిమాలు చేయలేడు అని చెప్పడంలో అతి శయోక్తి లేదు.
ఒక అరుదైన రికార్డును అల్లరి నరేష్ సొంతం చేసుకున్నాడు.అయితే ఈ ఆనందం అల్లరోడికి లేకుండా పోయింది.
తన మైలురాయి సినిమాను సోలో హీరోగా, ఒక మంచి దర్శకుడితో కలిసి, ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్లో సూపర్ హిట్ అయ్యేలా చేయాలని అల్లరి నరేష్ కోరుకున్నాడు.కాని తీరా ఒక సాదా సీదా రెగ్యులర్ సినిమాతో తన మైలు రాయి సినిమాను చేయాల్సి వచ్చింది.
‘జేమ్స్ బాండ్’ చిత్రం తర్వాత మోహన్బాబుతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నాడు.అయితే ఆ తర్వాత తన 50వ సినిమాను సోలోగా నటించి, ఆ తర్వాత మోహన్బాబుతో నటిస్తాను అంటూ దర్శకుడితో నరేష్ చెప్పి చూశాడు.
కాని అందుకు మోహన్బాబు ఒప్పుకోలేదు.ఇప్పుడు నటిస్తే నటించమనండి, లేదంటే మరో హీరోను ఎంపిక చేయండి అంటూ దర్శకుడితో సీరియస్గా చెప్పాడట.
దాంతో చేసేది లేక అల్లరోడు ఈ సినిమాను బాధపడుతూ చేయడం జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు.