హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది.ఓ వివాహితను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శవాన్ని రైల్వే పట్టాలపై పడేసిన ఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో గల కందిగల్ గేట్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే… చాంద్రాయణగుట్టలోని ఫూల్బాగ్ అహ్మద్ నగర్కు చెందిన రుహీనా కు అదే ప్రాంతానికి చెందిన మోహిన్తో రెండేళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు.
పెళ్లి జరిగిన కొద్ది కాలం నుంచే మోహన్ తరుచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు.ఈ నేపథ్యంలో నిన్న ఉదయం కందిగల్ గేట్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పట్టాలపై రూహినా శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో కాచిగూడ రైల్వే పోలీసులు, ఛత్రినాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.ఇక డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులకు మెడపై చున్నీతో ఉరి వేసినట్లు మహిళ మెడపై గుర్తులు ఉండడంతో హత్యగా నిర్దారణకు వచ్చారు.
వెంటనే డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపగా….జాగిలాలు సంఘటనా స్థలం నుంచి చుట్టు పక్కల తిరుగుతూ స్థానిక బస్తీలోని షాలిమార్ హోటల్ వరకు వెళ్లి ఆగిపోయాయి.
ఇదిలా ఉంటే ఆమె భర్త మొహీన్ పైనే పోలీసులకు అనుమానం ఉంది, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇదే క్రమంలో అతను పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.