పోస్టల్ పథకాలపై దుమాల లో అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై గ్రామ ప్రజలకుతపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ మెయిల్ ఓవెర్సెర్ సాయిరాం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

 Awareness Conference On Postal Schemes In Dumala , Postal Schemes In Dumala, Awa-TeluguStop.com

అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.ప్రతి ఇంటికి తపాలా బీమా అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ కార్యదర్శి మహేందర్ , మాజీ సర్పంచ్ కదిరె శ్రీనివాస్ తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్ రాజు , కిషన్ దాసుపేట సబ్ పోస్ట్ మాస్టర్ మాలోతు రాజు , దుమాల గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ సతీష్ తో పాటు పలువురు తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube