తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి వీడియోను విడుదల చేశారు.
యశోద ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కేసీఆర్ విన్నవించారు.తనను చూసేందుకు, పరామర్శించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం వలన ఆస్పత్రిలోని ఇతర పేషంట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.
ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు బయటకు పంపటం లేదని పేర్కొన్నారు.త్వరలోనే కోలుకొని తాను ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు.