చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) బెయిల్ పై విడుదల కావడం టీడీపీ నేతలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.52 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు బెయిల్ పై రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.చంద్రబాబు అమరావతికి బయలుదేరారు.కోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.అయితే చికిత్స తర్వాత చంద్రబాబుకు జైలుకెళ్లాల్సిందే అని సజ్జల,( Sajjala ) మరి కొందరు నేతలు కామెంట్లు చేస్తున్నారు.
చంద్రబాబుకి బెయిల్ రావడంతో చిరంజీవి డైలాగ్( Chiranjeevi Dialogue ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.“గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు తట్టుకున్న గుండెరా ఇదీ!” అనే డైలాగ్ ను చంద్రబాబు ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
చంద్రబాబు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు రాబోయే 28 రోజుల్లో రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ముందడుగులు వేయనున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్( Chandrababu Bail ) మంజూరైన నేపథ్యంలో షరతులను ఉల్లంఘిస్తే మాత్రం వైసీపీ ( YCP ) ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంది.చంద్రబాబు టీడీపీ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
చంద్రబాబు ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో( AP Politics ) మలుపులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.వైసీపీకి ఇది షాక్ అయినా ఈ పరిణాలను ముందుగానే వైసీపీ ఊహించని కామెంట్లు వినిపిస్తున్నాయి.చంద్రబాబుపై సీఐడీ తాజాగా మరో కేసు నమోదు చేయడానికి కారణమిదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు పొలిటికల్ వ్యూహాలతో 2024 సంవత్సరంలో మరోసారి సీఎం అవుతారేమో చూడాల్సి ఉంది.
చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు.