కారు వీడి హస్తం గూటికి చేరిన బిఆర్ఎస్ నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ పార్టీ మోసగించారు కాంగ్రెస్ పార్టీ ఆదరించారు అని గులాబీని వీడి హస్తం పార్టీలో చేరికయ్యానని గంట అంజా గౌడ్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేటకు చెందిన గంట అంజాగౌడ్, బింగి మల్లేశం లు శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికయ్యారు.

 Ellareddy Peta Brs Leaders Ganta Anja Goud Bingi Mallesham Joins Congress Party,-TeluguStop.com

అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన అంజా గౌడ్ మొన్న జరిగిన సేస్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు.అదేవిధంగా తన సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేయగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రంగంలోకి దిగి అంజయ్యను బుజ్జగించి విత్ డ్రా చేయించాడు.

కాగా బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించాలని ఆగయ్య ను కోరగా సూత్రపయంగా అంగీకారం తెలిపి ఆ పదవి తనకు కేటాయించకుండా మరో సామాజిక వర్గానికి చెందిన బందారపు బాల్ రెడ్డికి ఇవ్వడంతో తీవ్రంగా అసహనానికి లోనై పార్టీ మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ అని తనకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని అంజా గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పందిర్ల లింగం గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube