ఈ మధ్యకాలంలో సాధారణంగా చిన్న వయసులో ఉన్న వారు థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు.ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది ప్రజలు స్పెషల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు.
అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పరిశోధనలలో వెల్లడింది.థైరాయిడ్ గ్రంధి మనిషి మెడ క్రింద భాగంలో ఉంటుంది.
ఇది థైరాక్సిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తూ ఉంటుంది.మన జీవక్రియ రేటును నియంత్రించడంలో ప్రతి హార్మోన్ పోషిస్తుంది.
ఒకవేళ ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు గురైతే హైపర్ లేదా హైపోథైరాయిజం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
దివ్య కాలంలో ఇది ఇతర సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉంది.
ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని రకాల పోషకాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు.అవేంటో వాటిని తింటే థైరాయిడ్ ను దూరం చేసుకోవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్సిడేషన్ స్ట్రెస్ కారణంగా శరీర గ్రంధులు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయదు.అయితే ఈ ప్రభావాన్ని సెలీనియం నిరోధించగలదు.టాబ్లెట్ల ద్వారా వైద్యులు ఈ పోషకాన్ని తీసుకోమని సలహాలు ఇస్తూ ఉంటారు.కొన్ని పదార్థాలలో కూడా ఈ మినరల్ సహజంగా ఉంటుంది.
చికెన్, బ్రౌన్ రైస్, గుడ్లు, పుట్టగొడుగులు, ఆకుకూరలు, అరటిపండు, బాదం పప్పులో ఇది పుష్కలంగా ఉంటుంది.వీటిని ఆహారంలో ఉండేలా చూసుకుంటే థైరాయిడ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు.థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలంటే శరీరంలో తగినంత అయోడిన్ ఉండాలి.ఎందుకంటే అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే ఉపయోగించడం మంచిది.అలాగే సి ఫుడ్ లో కూడా ఆయోడిన్ ఎక్కువగా లభిస్తుంది.చవకైన ఉప్పులో ఈ పోషకం ఉండదు.
శాఖాహారుల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలలో తెలిసింది.కాబట్టి వీరు అయోడిన్ ఇంటెక్ విషయంలో అప్రమంతంగా ఉండడం మంచిది.విటమిన్ డి లోపం ఉన్నవారు కూడా థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఆహారంలో ఈ పోషకం తగ్గకుండా చూసుకోవడం మంచిది.విటమిన్ లోపం ఉన్నవారు థైరాయిడ్ సమస్యతో పాటు జుట్టు రాలడం, నిద్రలేమి, అలసటాయం, ఎముకల నొప్పి, డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఇలాంటివారు గుడ్డులో ఉన్న పచ్చ సోనా, సాల్మన్ చేప, పాలు, పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.