మనలో చాలామంది ” త్రీ ఇడియట్స్( 3 Idiots ) ” సినిమా చూసే ఉంటారు.సినిమా చివర్లో భారీ వర్షాల కారణంగా హీరోలు ముగ్గురు కలిసి హీరోయిన్ అక్కకు డెలివరీ చేసిన సన్నివేశం అందరికీ గుర్తు ఉండి ఉంటే ఉంటుంది.
అచ్చం అలాంటి సంఘటన తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీయోని జిల్లాలో జరిగింది.ప్రస్తుతం మధ్యప్రదేశ్( Madhya Pradesh ) లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పురిటి నొప్పులు రావడంతో బాధపడుతున్న మహిళలను వారి కుటుంబ సభ్యుల ఆసుపత్రిలోకి తీసుక వెళ్లలేకపోవడంతో వారికి తెలిసిన గైనకాలజిస్ట్ వీడియో కాల్ ద్వారా డెలివరీ చేశారు.
ఈ సంఘటనలో డాక్టర్ వీడియో కాల్ ద్వారా ప్రసవం దగ్గర ఓ మంత్రసాని సహాయం చేస్తూ మహిళకు డెలివరీ చేయించారు.ఇక ఆ డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ ద్వారా మంత్రసాని మహిళకు డెలివరీ చేయగా కవల పిల్లలు పుట్టడంతో అందరూ సంతోషంతో మునిగిపోయారు.
![Telugu Idiots, Madhya Pradesh, Pregnant Lady-Latest News - Telugu Telugu Idiots, Madhya Pradesh, Pregnant Lady-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/07/viral-news-Pregnant-lady-Operation-Doctor-help-Video-Call-3-Idiots-Madhya-Pradesh.jpg)
సోమవారం నాడు జోరవాడి గ్రామంలో రవీణ అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతున్న సమయంలో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు.అయితే దారిలోని రహదారులు నీళ్లతో నిండిపోవడంతో పరిస్థితి అర్థం చేసుకున్న జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మనీషాతో పాటు కొంతమంది ఆరోగ్య అధికారులు బృందాన్ని గ్రామానికి పంపించారు.అయితే అక్కడ పరిస్థితి శృతిమించడంతో అధికారులు ఆమె ఉన్న చోటికి వెళ్లలేకపోయారు.దీంతో డాక్టర్ సదరు మహిళా భర్తకు ఫోన్ చేసి గ్రామంలోని శిక్షణ పొందిన మంత్రసామిని వారి ఇంటి దగ్గరికి పిలిపించుకోమని తెలిపింది.
![Telugu Idiots, Madhya Pradesh, Pregnant Lady-Latest News - Telugu Telugu Idiots, Madhya Pradesh, Pregnant Lady-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/07/viral-news-Pregnant-lady-Operation-Doctor-help-3-Idiots-Madhya-Pradesh.jpg)
అధిక ప్రమాదం ఉన్న ఆ మహిళకు డెలివరీ అయ్యేలా డాక్టర్ సూచన మేరకు మంత్రసాని రేష్మ వాటిని శ్రద్ధగా పాటించి.డెలివరీ చేసి కవలలను సురక్షితంగా డెలివరీ చేసింది.ఇక మరుసటి రోజు వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోవకలకు అనువుగా మారిన తర్వాత మహిళతోపాటు అప్పుడప్పుడు 108 వాహనం ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించి వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.