అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్( CEIR Application ) ద్వారా పోయినటువంటి ఫోన్ లను బాధితులకు అందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రజల మన్ననలు పొందుతున్నారు.కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బోల్లే ప్రతాప్ ఫోన్ పోయిందని కోనరావుపేట పోలీస్ స్టేషన్( Konaraopet Police Station ) లో ఫిర్యాదు మేరకు పోలీసులు సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రంగంలోకి దిగారు.
బాధితుడు పోగొట్టుకున్నటువంటి పొన్ ను అత్యధునిక టెక్నాలజీతో లోకేషన్ ద్వారా గమనించి కోనరావుపేట ఎస్సై రమాకాంత్ చేతుల మీదుగా చరవాణిని బాధితునికి అప్పగించారు.దీనికి కృషి చేసిన కొనరావుపేట పోలీసులకు బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.