జగిత్యాల జిల్లా ధర్మపురి కౌంటింగ్ స్ట్రాంగ్ రూం కీ మిస్సింగ్ పై సమగ్ర విచారణ జరగనుంది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి జగిత్యాలకు రానున్నారు.
కొండగట్టు జేఎన్టీయూలో ఇవాళ విచారణ జరగనుంది.స్ట్రాంగ్ రూం కీ మిస్సింగ్ పై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రత్యేక అధికారి విచారణ జరపనున్నారు.ఈ నెల 26న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.