ఇటీవలే కాలంలో పెళ్లి అనేది ఓ ప్రధాన సమస్యగా మారింది.కాస్త వయసు దాటితే పెళ్లి కావడం కష్టమే.
పెళ్లి కాకపోయినా, లేటుగా అయినా సమస్యలు వస్తాయి.ముఖ్యంగా పిల్లలు పుట్టే అవకాశాలు వయసు పెరిగే కొద్దీ తక్కువగా ఉంటాయి.
పెళ్లి కాకపోతే సమాజం నుండి రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది.ఓ నలభై ఏళ్ల వ్యక్తి తనకు వివాహం చేయలేదని క్షణికావేశంలో తల్లిని కిరాతకంగా చంపిన ఘటన ఆదివారం జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
జైపూర్ లోని బింజాపూర్ పరిధిలో బింధానీ సాహీ ప్రాంతంలో ప్రేమలత అనే 61 ఏళ్ల ఆవిడ తన కుటుంబంతో పాటు జీవిస్తోంది.తన కుమారుడు గోపాల్ కు 40 ఏళ్లు.గోపాల్ కు ఇంకా వివాహం కాకపోవడంతో ఫ్రస్టేషన్ కు గురవుతూ తరచూ ఇంట్లో గొడవ పడేవాడు.ఇంట్లో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూనే ఉన్నాం, సెట్ కాకపోతే అందులో మా తప్పు ఏముందని చెప్పేవారు.
సంబంధం చూడడం, సెట్ చేసే బాధ్యత తల్లిదండ్రులదే కదా అంటూ గోపాల్ వాదించేవాడు.ఏ కుటుంబంలోనైనా పిల్లలకు మంచి సంబంధాలు కుదిరేలా చేసి పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులదే అంటూ, పెళ్లి విషయంలో తగిన ప్రయత్నాలు చేయడం లేదని గొడవలు చేసేవాడు.
గోపాల్ కు, తన తల్లిదండ్రులకు మధ్య మాటల యుద్ధం జరిగింది.కోపంలో ఉన్న గోపాల్ క్షణికావేశంలో తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయి ఓ పదునైన ఆయుధంతో తల్లి తలపై బలంగా కొట్టడంతో రక్తము మడుగులోకి జారి క్షణాల్లో తల్లి ప్రాణాలు విడిచింది.తల్లి చనిపోవడం చూసి, గోపాల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఏం చేయాలో తెలియక కంగారుతో అక్కడి నుండి పారిపోయాడు.ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించి బిదాపద అనే గ్రామంలో గోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.క్షణికావేశంలో గోపాల్ చేసిన పనికి, అతని జీవితం కటకటాల పాలైంది.