అక్కినేని ఎన్టీఆర్ ల ఆతిపత్యానికి అడ్డుగోడల నిలబడిన జమున పై అప్పట్లో బాయ్ కాట్ విధించిన విషయం అందరికీ తెలిసిందే.మూడేళ్ల పాటు ఆమెను స్టార్ హీరోలతో నటించకుండా అనధికారిక నిషేధం విధించి ఆమెతో క్షమాపణ చెప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్టీఆర్.
ఈ విషయం అంతా మనకు తెలిసినప్పటికీ అసలు నిజాలు మాత్రం ఇప్పటికీ మరుగునపడి ఉన్నాయి.జమున పై సదరు హీరోలకు అంత ద్వేషం ఎందుకు పెరిగింది, జమున చేసిన తప్పేంటి ? ఎలా మళ్లీ వీరి మధ్య ఆ సమన్వయం కుదిరింది అనే విషయాల్లో బయట ప్రపంచానికి తెలియని కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ లు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న సమయంలో ఎవరు హీరోయిన్ గా నటించిన వారి అడుగులకు మడుగులోత్తే పరిస్థితి ఉండేది.అయితే అక్కినేని తో పాటు ఒక సినిమాలో జమున నటిస్తున్న సమయంలో జమున కాలుపై కాలేసుకుని కూర్చుందట.అక్కినేని వచ్చినా కూడా ఆమె లేచి నిలబడి నమస్కారం చేయకపోవడంతో తనలో తానే రగిలిపోయారట అక్కినేని.ఇక జమున పై కోపం పెంచుకున్న అక్కినేని ఇదే విషయం అక్కినేని తో కూడా చెప్పారట.
దాంతో ఇద్దరు కూడా తమ సినిమాల్లో జమున ను పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారట.
ఈ విషయంలో పూర్తిగా అక్కినేని ది మాత్రమే తప్పుందట.ఎన్టీఆర్ ఖచ్చితంగా అమాయకులే అక్కినేని ఎన్నో నాటకాలు ఆడి తనను బయటకు రాకుండా సినిమాల్లో నటించకుండా చేయాలని చూశారట.కానీ జమున అప్పటికే ఏడాదికి ఆరు సినిమాలు చేయాలని నిర్ణయించుకుని అలాగే చేస్తూ వచ్చిందట.
వారు బాయ్ కాట్ విదించినా కూడా ఆమెకు వచ్చే సినిమాలు వస్తూనే అవి కూడా విజయం సాధించడంతో ఆమెను గుండమ్మ కథ సినిమాలో నటింపచేయాలని భావించారు ఆ చిత్ర బృందం.క్షమాపణ పత్రం రాయించాలని ప్రయత్నించినప్పటికీ ఈ జమున ఒప్పుకోకపోవడంతో నిర్మాత బలవంతం చేసి ముగ్గురి మధ్య సయోధ్య కుదిరించారట.
అయితే జమున ఈ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పి నిజాలను బయటపెట్టింది ఎన్టీఆర్ అమాయకుడు అని అక్కినేని పెద్ద నాటకాల రాయుడు అంటూ చెప్పుకొచ్చింది.