ఐటీ విచారణకు హాజరైన మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఐటీ ఎదుట హాజరైయ్యారు.భద్రారెడ్డి రెండోసారి ఐటీ అధికారుల విచారణకు హాజరైయ్యారని సమాచారం.

 Minister Mallareddy's Son Bhadra Reddy Attended The It Inquiry-TeluguStop.com

ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.

ఈ మేరకు ఐటీ అడిగిన ఫార్మాట్ లో మల్లారెడ్డి కాలేజీ వివరాలను భద్రారెడ్డి అధికారులకు అందించారని తెలుస్తోంది.అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లతో పాటు సీట్ల పేమెంట్లకు సంబంధించిన వివరాలను సైతం భద్రారెడ్డి అధికారులకు అందజేశారు.

ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube