సీఎస్‎తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

సీఎస్ సోమేశ్ కుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జగ్గారెడ్డి, అజారుద్దీన్ లు సీఎస్ ను కలిశారు.

 Telangana Congress Leaders Meeting With Cs-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు.ధరణిని రద్దు చేసి పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.

అర్హులకు అసైన్డ్ భూములు పట్టాలు ఇవ్వాలని టీకాంగ్రెస్ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు.రాష్ట్రంలో కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube