భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి నేటి నుంచి టికెట్లను విక్రయించనున్నారు.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో ఉదయం 10 గంటల నుంచి పేటీఎం సిబ్బంది టికెట్లు ఇవ్వనున్నారు.గుర్తింపు కార్డు తీసుకొచ్చి టికెట్లు తీసుకు వెళ్లాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సూచించింది.
నిన్నటి గందరగోళం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో భారత్- ఆసీస్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.