పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.ఢిల్లీ తరహాలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆప్ సర్కార్ సిద్ధం అయింది.
ఈ మేరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కీలక ప్రకటన చేశారు.నేడు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
అయితే, సమావేశం కావడానికి పేర్కొన్న నిబంధనలు సరిగా లేనందున అనుమతి నిరాకరించినట్టు వెల్లడించారు.