టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు.
అంతేకాకుండా రామ్ గోపాల్ ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది.వర్మ కూడా నిత్యం ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ వారి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
అయితే వర్మ దర్శకుడిగా ఒకప్పుడు తన సినిమాలతో ట్రెండ్ సెట్టర్, బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.కానీ ప్రస్తుతం వరుసగా ప్లాప్ లను చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈమేరకు రాధేశ్యామ్ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక నటుడి ముందు సినిమా అది సాధించిన వసూళ్ల ఆధారంగా ఆ హీరో నెక్స్ట్ సినిమా పై అంచనాలు ఉంటాయి.
ఇకపోతే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ రెమ్యునరేషన్ విషయం పక్కన పెడితే ఈ సినిమా మొత్తం బడ్జెట్ లో ఐదవ వంతు ఖర్చుతో సినిమా తీయవచ్చు.
అలాగే రాధేశ్యామ్ లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ లో అభిమానులకు విజువల్ పీస్ అవసరం లేదు.కథ లోని భావోద్వేగం భావాలను విజువల్ ఫీస్ట్ డామినేట్ చేస్తాయి ఇది కథను చంపేస్తుంది అంటూ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.బాలీవుడ్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి విడుదలయ్యే వరకు ఎవరికి తెలియదు.
కానీ విడుదల అయిన సినిమా నూరు కోట్ల వసూళ్లను సాధించింది అని తెలిపాడు ఆర్జివి.ఈ సినిమా కేవలం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
అలాగే రాధేశ్యామ్ సినిమాకు పెట్టిన బడ్జెట్, అలాగే సినిమా విడుదల తర్వాత వచ్చిన వసూళ్లకు అసలు పొంతనే లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్జివి. ఇక ఒక మూవీకి విజువల్ ఎఫేక్ట్స్ కంటే కథలో దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు నిరూపించాయని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక అతడి కామెంట్స్పై పలువురు అంటే తక్కువ బడ్జెట్తో అయిపోయే రాధేశ్యామ్ మూవీని కావాలనే విజువల్ ఎఫెక్ట్స్తో భారీ బడ్జెట్ సినిమా చేశారని అంటున్నారా వర్మ అని స్పందిస్తున్నారు.