1.దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు
దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ ఆవిర్భవించింది.కొంతమంది వ్యాపార వర్గాలకు చెందిన వారు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయగా ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది.
2.అమెరికా అధ్యక్షుడిపై చైనా ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.వచ్చే ఏడాది చైనా రాజధాని బీజింగ్ లో జరిగే ఒలంపిక్స్ ను దౌత్య పరంగా బహిష్కరించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆలోచిస్తుండడం పై చైనా మండిపడింది.
3.చంద్రబాబు కన్నీళ్ల పై ఎన్.ఆర్.ఐ టీడీపీ స్పందన
టిడిపి అదినేత చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు వైసీపీ నేతలు దిగడం పై ఎన్.ఆర్.ఐ టీడీపీ నేత జయరాం కోమటి మండిపడ్డారు.
4.కమలా హారీస్ కు అమెరికా అధ్యక్ష బాధ్యతలు
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అనారోగ్య కారణాల రీత్యా అమెరికా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అప్పగించారు.
5.అమెరికా టీమ్ లో భారత సంతతి క్రీడాకారులు
ఈ నెలలో జరగబోయే ప్రపంచ హాకీ కప్ కు భారత్ ఆతిథ్యం వహిస్తోంది.ఇక అమెరికా హాకీ టీమ్ లో ఐదుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
6.వింటర్ ఒలంపిక్స్ ను బహిష్కరించే ఆలోచనలో బ్రిటన్
చైనా రాజధాని బీజింగ్ లో జరగబోతున్న వింటర్ ఒలంపిక్స్ ను బహిష్కరించే ఆలోచనలో బ్రిటన్ ఉంది.
7.అమెరికాలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డొసులు
అమెరికాలో 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరికీ బూస్టర్ వాక్సిన్ డోస్ వేయాలని అమెరికా నిర్ణయించింది.
8.భారత్ లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు పై యూఎస్ కాంగ్రెస్ స్పందన
భారత్ లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు అండి లెనిన్ స్పందించారు.ఇది శుభ పరిణామం అని, తమకు ఎంతో సంతోషం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
9.యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు కు భారత్ తిరిగి ఎన్నిక
యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు కు 2021- 25 కాలానికి భారత్ తిరిగి ఎన్నికట్టింది.ఈ ఎన్నికల్లో భారత్ కు 164 ఓట్లు లభించాయి.
10.సింగపూర్ లో కార్తీక పౌర్ణమి వేడుకలు
‘శ్రీ సాంస్కృతిక కళా సారథి ‘ సింగపూర్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ భక్తమైన కథ గానం ఏర్పాటు చేశారు.