జేసీ అరాచకాలపై ! టీడీపీ ఫైర్ ? పొగ పెట్టేసారా ?

ఎప్పుడు వివాదాల్లో ఉంటూ, వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజులుగా టిడిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై తీవ్రంగానే స్పందిస్తున్నారు.

కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీ నాశనం అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల టిడిపి నిర్వహించిన రాయలసీమ సదస్సులో ప్రభాకర్ రెడ్డి సంచలనం రేపారు.  అంతే కాదు టిడిపి లోని కొంతమంది కీలక నాయకులపైన ఆయన విమర్శలు చేశారు.

దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ అధిష్టనం ఏ విధంగా స్పందిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.జెసి విషయంలో సానుకూలంగా వ్యవహరించినా, తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయంతో టిడిపి అధిష్ఠానం ఉందో ఏమో తెలియదు కానీ, ఒక్కొక్కరుగా టిడిపి మాజీ ఎమ్మెల్యేలు జెసి ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జెసికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నీ రాజకీయాలు తాడిపత్రిలో చేసుకో అనంతపురంలో చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త.!  నువ్వు బెదిరింపులు,  దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ గాజులు తొడుక్కొని ఎవరూ లేరు.

Advertisement

మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  అసలు మీరు వచ్చిన తర్వాతనే అనంతపురం జిల్లా టిడిపిలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి అంటూ ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు.

ఆయనే కాదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి సైతం ఇంతే స్థాయిలో విమర్శలు చేశారు.పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు మానుకోవాలని, ఇష్టముంటే పార్టీలో కొనసాగాలని,  లేకపోతే దూరంగా ఉండాలి అంటూ హితబోధ చేశారు./br>

వ్యక్తిగత అవసరాల కోసం  చంద్రబాబు వద్దకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఆపై పార్టీని భ్రష్టు పట్టించారు అంటూ మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజకీయాలు చేశారని, మీ వల్లే పార్టీ ఎంతగా దెబ్బతింది అంటూ జితేందర్ మండిపడ్డారు.జెసి ప్రభాకర్ విషయంలో ఒక్కో నేత స్పందిస్తున్న తీరు చూస్తుంటే జెసి బ్రదర్స్ విషయంలో టిడిపి ఒక అభిప్రాయానికి వచ్చిందని, ఇక వారిని పొమ్మనలేక పొగ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు