తెలుగు సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికి తెలిసిందే.మొదట పలు సినిమాలలో సహాయ పాత్రలలో నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నటనకు దూరంగా ఉంటూ నిర్మాత బాధ్యతలు చేపట్టాడు.
పలు సినిమాలకు నిర్మాతగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం మళ్లీ నటనను స్వాగతిస్తూ ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు బండ్లగణేష్.
ఇదిలా ఉంటే తాజాగా ఈడీ కార్యాలయంపై ఫైర్ అయ్యాడు బండ్ల.
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మళ్లీ కలకలం రేపుతుంది.
ఇక పలువురు నటులను ఈడీ అధికారులు విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.దీంతో తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కూడా విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపారు.
ఇక పూరి జగన్నాథ్ విచారణకు హాజరు అవ్వగా ఆయనను ఈడీ అధికారులు పలు రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
అదే సమయంలో ఈ కార్యాలయానికి బండ్ల గణేష్ కూడా రావడంతో.
బండ్ల గణేష్ కు కూడా ఇందులో సంబంధం ఉందని వార్తలు వినిపించాయి.
![Telugu Bandla Ganesh, Bandlaganesh, Ed, Puri Jagannath, Tollywood, Tollywood Dru Telugu Bandla Ganesh, Bandlaganesh, Ed, Puri Jagannath, Tollywood, Tollywood Dru](https://telugustop.com/wp-content/uploads/2021/09/bandla-ganesh-to-ed-office-for-director-puri-jagannaths.jpg )
దీంతో ఈ విషయం గురించి ఆయన స్పందిస్తూ తనకు ఎవరు నోటీసులు ఇవ్వలేదని కేవలం పూరి జగన్నాథ్ కోసం వచ్చాను అని తెలిపాడు.ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ.
![Telugu Bandla Ganesh, Bandlaganesh, Ed, Puri Jagannath, Tollywood, Tollywood Dru Telugu Bandla Ganesh, Bandlaganesh, Ed, Puri Jagannath, Tollywood, Tollywood Dru](https://telugustop.com/wp-content/uploads/2021/09/bandla-ganesh-to-ed-officee-for-director-puri-jagannath.jpg )
దయచేసి నన్ను అర్థం చేసుకోండి.నాకు ఏ విధమైన సంబంధం లేదు అంటూ కేవలం పూరికి మద్దతు కోసం వచ్చాను అని తెలిపాడు.అంతేకాకుండా ఈడీ అధికారులు విచారణ చేపట్టిన సమయంలో పూరి జగన్నాథ్ బండ్లగణేష్ పేరును తీసుకు వచ్చినట్లు అందుకే ఆయనను అక్కడికి పిలిపించారని మళ్లీ పుకారు రావడంతో.
వెంటనే బండ్ల ఫైర్ అవుతూ నేను ఒక్క పొడి కూడా వేసుకోను.నాకెందుకు నోటీసు ఇస్తారు అంటూ ఈడీ కార్యాలయంపై మండిపడ్డాడు.