మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ మరియు రానా లు నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
సాదారణంగా కొన్ని క్లాసిక్ సినిమాలు సూపర్ హిట్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసే సమయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మార్చడం వల్ల సినిమా కొన్ని సార్లు ఫలితాలు తారు మారు అవుతాయి.
కొన్ని సార్లు మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఎక్కువ శాతం సినిమా ప్లేవర్ పోకుండా సినిమా రీమేక్ చేయాలని అంతా భావిస్తారు.
ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను కూడా చాలా సింపుల్ గా ఎక్కువ మార్పులు లేకుండా చేయాలని భావిస్తున్నారు.అందుకు గాను పాటలు జొప్పించే నిర్ణయాన్ని మానుకున్నారట.
మొదట అనుకున్న ప్రకారం ఈ సినిమాలో అయిదు పాటలు తీయాల్సి ఉంది.కాని తాజాగా త్రివిక్రమ్ సలహా మేరకు కేవలం రెండు లేదా మూడు పాటలను ఖరారు చేశారు.
ఒరిజినల్ వర్షన్ లో పెద్దగా పాటలు లేవు.కనుక కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాటలను జొప్పించే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు సాగర్ చంద్ర కు మరియు హీరో పవన్ కళ్యాణ్ కు పాటల విషయమై త్రివిక్రమ్ సలహా ఇచ్చాడని తెలుస్తోంది.
సినిమా లు తప్పకుండా బాక్సాపీస్ వద్ద మంచి విజయాలను దక్కించుకుంటాయనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నప్పుడు మార్పులు చేర్పులు అతిగా ఉంటే ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవ్వడంతో పాటు.ఒరిజినల్ ఫీల్ కోల్పోయిందని విమర్శలు వచ్చే అవకాశం ఉంది.అందుకే పాటల విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.